- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,579 కొత్త కోవిడ్-19 కేసులు, 5 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 1,811 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,26,124కి చేరింది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 1,287 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 2,04,388 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 20,449 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 17,071 మంది బాధితులు హోం ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా హైదరాబాద్ లో 256, మేడ్చల్ లో 135, రంగారెడ్డిలో 102, ఖమ్మంలో 106 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి.
1579 New Covid 19 Cases Recorded in Telangana
- Advertisement -