హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,610 కరోనా పాజిటివ్ కేసులు, 9 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా హెల్త్ బులెటెన్ విడుదల చేసింది. తెలంగాణలో ఇప్పటివరకు 480 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 57,142 కరోనా కేసులు నమోదైయ్యాయి. 42,909 మంది ఈ వైరస్ తో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 13,753 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24గంటల్లో హైదరాబాద్ లో 531 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. రంగారెడ్డి 172, వరంగల్ అర్భన్ 152, మేడ్చేల్ 133 కేసులు నమోదయ్యాయి. హైకోర్టు ఆదేశాలతో 59 పేజీలతో కరోనా బులెటెన్ ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పడకల వివరాల ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 55 ప్రైవేట్ ఆస్పత్రుల్లో 4,497 బెడ్స్ ఉన్నాయి. అందులో రాష్ట్రంలో 3032 బెడ్స్ ఫుల్ ఉండగా.. ఇంకా 1465 బెడ్స్ ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది.
1610 new corona cases reported in telangana