Thursday, March 28, 2024

కాన్పూర్ లో ఘోర ప్రమాదం: 17 మంది మృతి

- Advertisement -
- Advertisement -

17 Killed In Bus Accident In Kanpur

కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 24 మందికి తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు సచెంది వద్ద జెసిబిని ఢీకొని బ్రిడ్జి పైనుంచి కిందపడింది. స్థానికుల సమాచారంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. యుపి రోడ్ వేస్‌కు చెందిన శతాబ్ది ఎసి బస్సు లక్నో నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News