Tuesday, April 23, 2024

దేశంలో కొత్తగా 17092 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

17092 Corona positive cases in India

 

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 17092 కేసులు నమోదుకాగా 29 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా వైరస్  4,34,86,326 మందికి సోకగా 5,25,168 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 4,28,51,590 మంది కోలుకోగా ప్రస్తుతం 1.09 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 4.14 శాతానికి పెరిగిందని, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల శాతం 0.25కు చేరింది. రికవరీ రేటు 98.54 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 197.84 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News