Wednesday, April 24, 2024

ఎపిలో కొత్తగా 1,747 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1747 New Covid-19 cases reported in AP

అమరావతి: ఎపిలో కోవిడ్-19 ఉద్ధృతి రోజురోజుకూ తగ్గుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 65,920 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,747 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో వైరస్‌ బారినపడిన వారిలో 2,365 మంది కోలుకోగా, మరో 14 మంది మృతిచెందారు. ఆంధ్రలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 1,95,0339కి చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,91,4177 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ప్రస్తుతం 22,939 కోవిడ్ యాక్టివ్‌ కేసులున్నాయి. వైరస్ బారినిపడి 13,223 ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

1747 New Covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News