Wednesday, April 24, 2024

వరద ప్రాంతం నుంచి బయటపడిన 178 మంది

- Advertisement -
- Advertisement -

178 persons rescued from Pattan Valley

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లహౌల్ స్పిటి ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న దాదాపు 178 మందిని రక్షించ గలిగినట్టు జిల్లా అధికారులు శనివారం తెలిపారు. మంగళవారం తొజింగ్ నుల్లా ప్రాంతంలో కుంభవృష్టి కురియడంతో వీరంతా ఉదయ్‌పూర్‌లో చిక్కుకున్నారు. వాతావరణం అనుకూలించక పోవడంతో వీరిని రోప్‌వే సహాయంతో వరద నుంచి రక్షించ గలిగామని అధికారులు వివరించారు. ఇంకా అక్కడ వివిధ ప్రాంతాల్లో 66 మంది చిక్కుకుని ఉన్నారని చెప్పారు. వీరిలో జహ్లామా వద్ద 37 మంది, షాన్‌షా వద్ద 15 మంది, ఫూడా వద్ద 14 మంది ఉన్నారు. ఆదివారం వీరిని అక్కడ నుంచి తరలిస్తారు. శనివారం ఉదయం ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ లహౌల్ లోయలో వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు.

178 persons rescued from Pattan Valley

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News