Friday, April 19, 2024

మనస్తాపంతో యువతి ఆత్మహత్య…

- Advertisement -
- Advertisement -

suicide

దుండిగల్‌: మేడ్చల్ మల్కాజిగిరిజిల్లాలోని దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడితో వివాహం చేయడంలేదని మనస్తాపానికి లోనైనా యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దుండిగల్‌ మున్సిపాలిటీ, ఇందిరమ్మకాలనీలో నివాసం ఉంటున్న దంపతుల కూతురు వైష్ణవి(18) ఓ ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వహిస్తోంది. అయితే.. యువతికి బహదూర్‌పల్లికి చెందిన యువకుడితో పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. 

యువకుడిని ప్రేమించానని తననే పెళ్లి చేసుకుంటానని వైష్ణవి తల్లిదండ్రులకు చెప్పింది. పెండ్లికి కాస్త సమయం పడుతుందని తల్లిదండ్రులు యువతికి నచ్చజెప్పారు. దీంతో మనస్తాపానికిలోనైనా యువతి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

18 Years Girl Committed Suicide At Medchal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News