Saturday, April 20, 2024

ఎపిలో కొత్తగా 1813 కేసులు.. 17మంది మృతి

- Advertisement -
- Advertisement -

1813 New Corona Cases Reported in AP

అమరావతిః ఆంధ్రప్రదేశ్‌లో మహమ్మారి కరోనా వైరస్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,813 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. కరోనాతో మరో 17 మంది మరణించారని, 1,168మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది.గత 24 గంటల్లో 20,590మంది కరోనా పరీక్షలు చేయగా.. ఎపికి చెందిన 1775 మందికి కరోనా పాజిటీవ్ రాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 34 మందితోపాటు విదేశాల నుంచి వచ్చి మరో నలుగురికి కరోనా పాజిటీవ్ వచ్చింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 27,235కు చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 309 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు కరోనా నుంచి 14,393మంది బాధితులు కోలుకున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో 12,533 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

1813 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News