Friday, April 26, 2024

దేశంలో 20వేల దిగువకు కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

18132 New Corona Cases Reported in India18132 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. 20 వేల దిగువనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,132 కేసులు వెలుగులోకి వచ్చాయి. కరోనాతో మరో 193 మంది బాధితులు మృతి చెందగా, ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,50,782కి చేరింది. కొత్త కేసులు కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. గత 24 గంటల్లో 21,563 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 3.32 కోట్లు దాటింది. ఇక, క్రియాశీల కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలో 2,27,347 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 95.19 కోట్లు టీకా డోసులు పంపిణీ అయ్యాయి. త్వరలో రెండు కోట్ల సంఖ్య దాటేందుకు రాష్ట్రాలు సమాయత్తం కావాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. కాగా, గత 24 గంటల్లో కేరళలో కొత్తగా 10,691 కరోనా కేసులు నమోదు కాగా, 85 మంది బాధితులు మరణించారు.

18132 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News