Saturday, April 20, 2024

రాష్ట్రంలో కొత్తగా 183 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

183 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 41,363 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 183 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. గురువారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,69,739కు పెరిగింది. తాజాగా 183 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,61,829 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఒక్కరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,943కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.81 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,967 యాక్టివ్ కేసులున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News