- Advertisement -
అమరావతి: ఎపిలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 70,727 పరీక్షలు చేయగా 1,843 మందికి కరోనా సోకింది. తాజాగా 2,199 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకోగా, 12 మంది మృతిచెందారు. ఆంధ్రలో ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,48,592కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 19,11,812 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఎపిలో ప్రస్తుతం 23,571 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు వైరస్ బారినపడి 13,209 ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 301, పశ్చిమ గోదావరి జిల్లాలో 235, ప్రకాశం జిల్లాలో 232, తూర్పు గోదావరి జిల్లాలో 222, నెల్లూరు జిల్లాలో 203 కేసులు బయటపడ్డాయని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.
1843 new covid-19 cases reported in andhra pradesh
- Advertisement -