Friday, March 29, 2024

దేశంలో 24 గంటల్లో 18,522 కేసులు.. 418మంది మృతి

- Advertisement -
- Advertisement -

19459 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: భారత్‌లో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతుండడం తీవ్ర భయాందోన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 20 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య ఇప్పటికే ఐదున్నర లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,522 కొత్త కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 418 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం 5,66,840 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 16,893 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 2,15,125 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక, కరోనా నుంచి 3,34,821 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా కేసుల సంఖ్య కోటీ 4 లక్షలకు చేరింది. ఇప్పటివరకు ప్రపంచంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 5లక్షల 3వేలకు చేరింది. కాగా, జులై నెలాఖరకు భారత్, పాకిస్తాన్, ఆఫ్రికా దేశాల్లో కరోనా వైరస్ విజృంభణ పీక్ లో ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

18522 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News