Thursday, March 28, 2024

రాష్ట్రంలో మరో 186 మందికి వైరస్

- Advertisement -
- Advertisement -

186 New Covid-19 Cases Reported in Telangana

జిహెచ్‌ఎంసి పరిధిలో 35, జిల్లాల్లో 151 మందికి వైరస్
2,93,923కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

హైదరాబాద్: రాష్ట్రంలో మరో 186 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 35 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 3, భద్రాద్రి 8, జగిత్యాల 6, జనగాం 3, భూపాలపల్లి 5, గద్వాల 0, కామారెడ్డి 3, కరీంనగర్ 11,ఖమ్మం 7 , ఆసిఫాబాద్ 1, మహబూబ్‌నగర్ 5, మహబూబాబాద్ 2, మంచిర్యాల 7, మెదక్ 3, మేడ్చల్ మల్కాజ్‌గిరి 12, ములుగు 2, నాగర్‌కర్నూల్ 0, నల్గొండ 9, నారాయణపేట్ 0, నిర్మల్ 2, నిజామాబాద్ 7, పెద్దపల్లి 8, సిరిసిల్లా 3, రంగారెడ్డి 15, సంగారెడ్డి 1, సిద్ధిపేట్ 1, సూర్యాపేట్ 3, వికారాబాద్ 3, వనపర్తి 2, వరంగల్ రూరల్ 1, వరంగల్ అర్బన్ లో 11, యాదాద్రిలో మరో ఏడుగురికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. అంతేగాక వైరస్ దాడిలో మరోకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,93,923కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,89,631కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు. మాస్కు, భౌతిక దూరం, శానిటేషన్‌తోనే వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని ఆయన అన్నారు. ముఖ్యంగా జనసమ్మర్ధ ప్రాంతాలు, మార్కెట్లలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

77.59 లక్షలు దాటిన కరోనా టెస్టులు….

రాష్ట్రంలో ఇప్పటి వరకు 77 లక్షల 59 వేల 415 మందికి కరోనా టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అంటే ప్రతి పది లక్షల్లో 2,08,474 మందికి టెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ప్రతి రోజు 44 శాతం ప్రైమరీ, 12 శాతం సెకండరీ కాంటాక్ట్‌లకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు ప్రతి రోజు చేసే టెస్టుల్లో 97 శాతం ప్రభుత్వ కేంద్రాల్లో కేవలం 3 శాతం మాత్రమే ప్రైవేట్ సెంటర్లలో టెస్టులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో టెస్టుల సంఖ్యను మరింత పెంచుతామని ఆరోగ్యశాఖ పేర్కొంది. అంతేగాక మన రాష్ట్రంలో రికవరీ రేట్ 98.53 శాతంగా రికార్డు కావడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News