Friday, March 29, 2024

దేశంలో 20వేల దిగువకు పాజిటీవ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

18833 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో కొత్తగా 18,833 క‌రోనా పాజిటివ్ కేసులు కొత్త‌గా న‌మోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇక, కరోనాతో మరో 278మంది బాధితరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3.39కోట్లు దాటింది. ఇప్పటివరకు దేశంలో కరోనాతో 4,49,538 మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో 24,770మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.31కోట్లకు పైగా మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 2,46,687 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 92కోట్లకు పైగా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

18833 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News