Thursday, April 25, 2024

భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం..

- Advertisement -
- Advertisement -

18870 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 15,04,713మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 18,870 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక, కరోనా బారిన పడి మరో 378మంది బాధితులు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3.37కోట్లకు పైగా పెరిగింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,47,751 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24గంటల్లో దేశంలో 28,178 మంది కోలుకోగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.29కోట్ల మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 2,82,520 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 87.66కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

18870 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News