- Advertisement -
హైదరాబాద్: తెలంగాణను కరోనా వైరస్ భయపెడుతోంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,896 కొత్త కరోనా పాజిటివ్ కేసులు.. 8 మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్-19 కేసులు 82,647కి పెరిగాయి. తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 645కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 59,374 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 22,628 యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో కొత్తగా హైదరాబాద్ లో 338, రంగారెడ్డిలో 147, కరీంనగర్ లో 121, మేడ్చల్ లో 119, వరంగల్ అర్బన్ లో 95, జనగామలో 71, పెద్దపల్లిలో 66, ఖమ్మంలో 65, సిద్దిపేటలో 64 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అటు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.
1896 new Covid 19 cases reported in telangana
- Advertisement -