- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్ విస్తరణ వేగంగా కొనసాగుతోంది. కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,897కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 84,544కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 654 మంది మరణించారు. రాష్ట్రంలో 22,596 యాక్టివ్ కేసులుండగా… 61,294 మంది కోవిడ్ తో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 24గంటల్లో హైదరాబాద్ లో 479, రంగారెడ్డిలో 162, సంగారెడ్డిలో 107 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు తెలంగాణలో 6,65,847 మందికి కరోనా టెస్టులు చేసినట్టు అధికారులు తెలిపారు.
- Advertisement -