హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 1,931 కొత్త కోవిడ్-19 కేసులు, 11 మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86,475కి పెరిగింది. ఈ మహమ్మారి భారినపడి 665 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 63,074 మంది ఈ వైరస్ తో కోలుకుని డిశ్చార్జ్ కాగా… ప్రస్తుతం 22,736 యాక్టివ్ కేసులున్నాయి. హైదరాబాద్ లో 298, వరంగల్ అర్బన్ లో 144, రంగారెడ్డిలో 124, కరీంనగర్ లో 89, సంగారెడ్డిలో 86, నల్గొండలో 84, ఖమ్మంలో 73, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 71, సిద్దిపేటలో 71, పెద్దపల్లి, 64, సూర్యాపేట 64, కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,89,150 కరోనా టెస్టులు చేయగా, గడిచిన 24గంటల్లో 23,303 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.
తెలంగాణలో మరో 1,931 మందికి కరోనా
- Advertisement -
- Advertisement -
- Advertisement -