Thursday, April 25, 2024

తీవ్ర విషాదం: కరెంట్ తీగ‌లు త‌గిలి ఇద్ద‌రు గిరిజ‌నులు మృతి..

- Advertisement -
- Advertisement -

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని మూకమామిడి మండ‌లం మాదారం అట‌వీ ప్రాంతంలో అడ‌వి జంతువుల కోసం వేట‌గాళ్లు అమ‌ర్చిన కరెంట్ తీగ‌లు త‌గిలి మంగ‌ళ‌వారం ఉదయం ఇద్ద‌రు గిరిజ‌నులు మృతి చెందారు. కూలీ ప‌నుల‌కు వెళ్తుండ‌గా జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగ‌ల‌పై కాలు పెట్టడంతో ఇద్దరు గిరిజ‌నులు షాక్‌కు గురై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతి చెందినవారిని మొగ‌రాల‌కుప్ప‌కు చెందిన పాయం జాన్‌బాబు(24), కూరం దుర్గారావు(35)గా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

2 Adivasis died as electric shock in Kothagudem

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News