Friday, April 19, 2024

పిల్లలతో కలిసి చెరువులో దూకిన తల్లి.. ఇద్దరు పిల్లలు మృతి

- Advertisement -
- Advertisement -

Pond in Suryapet

సూర్యాపేటః ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులోకి దూకిన దారుణ సంఘటన సూర్యపేటలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో కూతురు జ్యోతి మాధవి(9), కొడుకు హర్షవర్ధన్(6) మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పెన్ వహాడ్ మండలం సింగిరెడ్డిపాలెంకు చెందిన నాగమణి అనే మహిళ తన కొడుకు, కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు ఆదివారం రాత్రి జిలా పట్టణంలోని సుద్దాల చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

అయితే, నాగమణి ప్రాణాలతో బయటపడగా.. కొడుకు, కూతురు మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చెరువులో గాలించి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను సూర్యాపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నాగమణిని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించి వివరాలను తెలుసుకుంటున్నారు. కుటుంబ కలహాలతోనే నాగమణి ఆత్మహత్యాయత్నం చేసిందని పోలీసులు తెలిపారు.

2 children died after mother thrown into Pond in Suryapet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News