- Advertisement -
శ్రీనగర్ః జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సోపోర్లో బుధవారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లతోపాటు మరో పౌరుడు కూడా మృతి చెందినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, భద్రతా బలగాలు ఘటనా ప్రాంతాన్ని చుట్టుమట్టి ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
2 CRPF personnel killed in terrorists attack in J&K
- Advertisement -