Friday, March 29, 2024

రైలు పట్టాలపై ఆత్మహత్య.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

2 Died after suicide at Railway Track in Dadwal

జోగులాంబ గద్వాల్: పట్టణంలోని మేల చెరువు సమీపంలో రైలు పట్టాలపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. కర్నూల్ జిల్లా దేవనకొండ చెందిన మహిళగా గుర్తించారు. యువకుడిది ఏ ఊరు అన్నది తెలియలేదు, కానీ ధర్మవరంలో టికెట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇది హత్యా?, లేక ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కాగా, వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

2 Died after suicide at Railway Track in Gadwal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News