Wednesday, April 24, 2024

ఫ్లైఓవర్ పై పిడుగు.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

2 Died as Thunder stone in Mancherial

మంచిర్యాల: జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఫ్లై ఓవర్ పై పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన వెంకటేష్, మౌనిక దంపతులు తమ 8నెలల బాబు శ్రీయాన్ అనారోగ్యంతో బాధపడతుండగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చి తిరిగి వెళ్తుండగా సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో రైల్వే బ్రిడ్జిపై ఒక్కసారిగా పిడుగు పడడంతో తల్లి, కొడుకులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన తండ్రి వెంకటేష్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.  ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాట్లు చెప్పారు.

2 Died as Thunder stone in Mancherial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News