Tuesday, April 16, 2024

నల్లగొండలో రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

2 died in Road Accident in Nalgonda

నల్లగొండ: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం చింతపల్లి మండలం మాల్ ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న లారీని క్రూయిజర్ వాహనం ఢీకొట్టింది. దీంతో క్రూయిజర్ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో 9మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని మర్రిగూడ మండలం వట్టిపల్లికి చెందిన రాములు, సత్తయ్యగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

2 died in Road Accident in Nalgonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News