Friday, April 19, 2024

వ్యవసాయ బావిలో పడి ఇద్దరు రైతులు మృతి

- Advertisement -
- Advertisement -

Worker dead

మనతెలంగాణ/రాజంపేట: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కన్కల్ గ్రామ శివారులో వ్యవసాయ బావిలో పడి ఇద్దరు రైతులు మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కన్కల్ గ్రామ శివారులో కౌడి పోచయ్య(60), చాకలి అశోక్(25) అనే ఇద్దరు కలసి గ్రామ శివారులోని తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి మోటారు బిగిస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడి అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం వ్యవసాయ బావి వద్ద గల మోటారు కాలిపోవడంతో మరమ్మత్తు చేయడానికి అశోక్, పోచయ్యలు ఇద్దరు కలసి బావి వద్ద మోటారును బిగిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన పల్లె చాకలి అశోక్ వృత్తిరీత్యా వ్యవసాయ కూలీ పని చేసుకుంటున్నాడు. పోచయ్య, అశోక్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోచయ్యకు గల వ్యవసాయ బావిలో బోరును దించడానికి వెళ్లుతున్నట్లు తెలిపినట్లు, సాయంత్రం సమయంలో ఫోన్ చేయగా ఇరువురు వ్యక్తుల ఫోన్ స్విచాఫ్ రావడంతో చేనులోకి వెళ్లి చూడగా బావి వద్ద బట్టలు, చెప్పులు కనిపించాయి. బావిలో పడినట్లు ఆనవాళ్లు కనిపించాయని అశోక్ అన్న సంజీవ్ తెలిపారు. శనివారం ఉదయం 10గంటలకు మోటారు సహయంతో నీరును తీసివేయగా రెండు మృతదేహలను బయట పడినట్లు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు మోటారు బిగిస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు.

2 Farmers died after fell into well in Kamareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News