Friday, April 19, 2024

ప్రియురాలి ఇంటిపై పెట్రోల్ దాడి.. ఇద్దరు చిన్నారులు మృతి

- Advertisement -
- Advertisement -

man sets fire on womans house in AP

తూర్పు గోదావరి: ప్రియురాలి ఇంటిపై ఇరవై ఏడేళ్ల ఓ యువకుడు పోట్రోల్ పోసి నిప్పంటించడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడగా.. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎపిలో తూర్పు గోదావరి జిల్లాలోని దుల్లా గ్రామంలో చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఈ దాడికి పాల్పాడిన వ్యక్తిని శ్రీనివాస్(27)గా స్థానికులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. సత్యవతి అనే మహిళ పెద్ద కూతురిని ఇష్టపడ్డ శ్రీనివాస్.. తనతో పెళ్లి చేయమని అడిగాడు. ఇందుకు నిరాకరించిన సత్యవతి తన కూతురిని మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేసింది. దీంతో ఆమెపై పగపెంచుకున్న శ్రీనివాస్ ఈ నెల 17న వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ నేపథ్యంలో సత్యవతి పోలీసులకు ఫిర్యాదు చేసినా శ్రీనివాస్ పై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని స్థానికులు తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున సత్యవతి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తున్న సమయంలో వారిచుట్టూ శ్రీనివాస్ పెట్రోల్ పోసి నిప్పంటించి, తర్వాత బయటనుంచి గడియ పెట్టి పారిపోయాడు. దీంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. సత్యవతితో సహా మరో ముగ్గురు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

2 kids dead after man sets fire on womans house in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News