Friday, April 19, 2024

లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

2 Killed after car crashes into Lorry in Yadadri

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్‌ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని గూడురు ప్రాంతం సమీపంలో ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. మృతులను హైదరాబాద్ లోని నాచారంకు చెందిన దంపతులు ప్రశాంత్, శిరీషలుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

2 Killed after car crashes into Lorry in Yadadri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News