Thursday, April 25, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..

- Advertisement -
- Advertisement -

2 Killed in Road accident in Vizianagaram

విజయనగరం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూసపాటిరేగి మండలంలోని అగ్రహారంలో ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన ఓ కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో మరణించినవారిని ఒడిశాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

2 Killed in Road accident in Vizianagaram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News