Saturday, April 20, 2024

సంగారెడ్డి బయోడీజిల్ పరిశ్రమలో పేలుడు.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

 

సంగారెడ్డి: జిల్లాలోని జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తండా వద్ద ఉన్న స్కంద బయోడీజిల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు పరిశ్రమలో రియాక్టర్ పేలి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్రిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్స్ తో మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

2 labour died after blast in Biodiesel factory in Sangareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News