Wednesday, April 24, 2024

కొత్తగూడెం సరిహద్దు అడవుల్లో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

- Advertisement -
- Advertisement -

2 Maoists killed in Encounter at Kothagudem District

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా సరిహద్దు అడవుల్లో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. సోమవారం చర్లా-ఛత్తీస్ గఢ్ సరిహద్దు అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులు మందు పాతర పేల్చిన గంటల వ్యవధిలోనే ఎన్‌కౌంటర్ జరగిన సమాచారం. వరుస ఘటనలతో ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల జిల్లాలోని గుండాల మండలం దేవళ్లగూడెం అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మరణించారు.

2 Maoists killed in Encounter at Kothagudem District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News