- Advertisement -
జోహెన్నస్బర్గ్: దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్లో కరోనా కల్లోలం నెలకొంది. ఇద్దరు మహిళా క్రికెటర్లు మరో సహాయక సిబ్బందికి కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో దక్షిణాఫ్రికా క్రికెట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు సౌతాఫ్రికా మహిళా క్రికెటర్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇద్దరు క్రికెటర్లకు పాజిటివ్ వచ్చింది. వీరితో పాటు ఓ సహాయక సిబ్బందికి కూడా కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక కరోనా వచ్చిన వారిని ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరికి కరోనా లక్షణాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయని, దీంతో ఎవరూ ఆందోళణ చెందాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది.
2 SA Women Cricketers test positive for Corona
- Advertisement -