Thursday, April 25, 2024

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టుల హతం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్, బందిపోరా జిల్లాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న నలుగురిని కాశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బందిపొరా జిల్లాలోని గుంద్‌జహంగిర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన బలగాలు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఓ ఉగ్రవాది మరణించాడు.

మరోవైపు, అనంత్‌నాగ్‌ జిల్లాలోని వెరినాగ్‌ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది మృతి చెందగా.. నలుగురు పోలీసులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

2 Terrorists killed by Security Forces Encounter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News