Saturday, April 20, 2024

నీటికుంటలో మునిగి ఇద్దరు యువకులు మృతి..

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: జిల్లాలోని తాండూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని మాచారం టౌన్‎షిప్ శివారులో నీటికుంటలో మునిగి ఇద్దరు యువకులు దూడం సతీష్(21), వాసు(18)లు మృతిచెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామస్థుల సహాయంతో పోలీసుల నీటికుంటలో నుంచి మృతదేహాలను బయటకి తీశారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.

2 young boys drowned in lake in Mancherial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News