- Advertisement -
న్యూఢిల్లీ : భారత ప్రభుత్వానికి, ప్రైవేట్ ఆస్పత్రులకు ఒక్క సెప్టెంబర్ లోనే కొవిషీల్డ్ వ్యాక్సిన్ 20 కోట్ల డోసులను సరఫరా చేస్తామని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించినట్టు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. సీరంకు చెందిన ప్రభుత్వ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు ఈ విషయాన్ని తెలియచేశారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్లాను సీరం మేలో ప్రభుత్వానికి సమర్పించింది. ఆగస్టు, సెప్టెంబర్లో పది కోట్ల డోసుల వంతున పంపిణీ చేస్తామని చెప్పింది. అయితే ఈ ఉత్పత్తి సామర్ధాన్ని ఇప్పుడు 20 కోట్ల డోసుల వరకు పెంచుకుంది.
20 crore Covishield doses to be supplied in September
- Advertisement -