- Advertisement -
చెన్నై: తమిళనాడులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదాలు జరిగాయి. వేర్వేరు ప్రమాదాల్లో దాదాపు 20మంది మృతి చెందినట్టు సమాచారం. తిరుపూర్ జిల్లాలో ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 26 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వైద్యులు వెల్లడించారు. అటు సేలం జిల్లాలోని ఓమలూరులో కారు-బస్సు ఢీకొని జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదురుగు మృతి చెందారు. మృతులను నేపాల్ వాసులుగా గుర్తించారు.
20 Killed in Two Road Accident At Tamil Nadu
- Advertisement -