Wednesday, April 24, 2024

మహబూబాబాద్ లో ట్రాక్టర్ బోల్తా: 20 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో శుక్రవారం ఉదయం ట్రాక్టర్ బోల్తాపడడంతో 20 మంది గాయపడ్డారు. బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో ఇసుకను ట్రాక్టర్‌లో నింపేందుకు 30 మంది వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News