- Advertisement -
కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్ మండలం దగ్గి వద్ద మంగళవారం లారీ బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో 20 మంది వలస కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. వలస కూలీలు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. లారీ వేగంతో ప్రయాణించడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.
20 Migrant workers injured in road accident
- Advertisement -