- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు కరోనా కేసులు డెబ్బై వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 2,012 కొత్త కోవిడ్-19 కేసులు, 13 మరణాలు సంభవించాయని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా ప్రకటించింది. హైదరాబాద్ లో 532, మేడ్చల్ లో 192, రంగారెడ్డిలో 188 కొత్త కరోనా కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 70,958కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 576 మందిని కరోనా కబలించింది. తెలంగాణలో ప్రస్తుతం 19,568 యాక్టివ్ కేసులుండగా… ఇప్పటివరకు 50,814 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5లక్షల 22,143 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించారు. 24 గంటల్లో 21,118 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు అధికారులు వెల్లడించారు.
- Advertisement -