Thursday, March 28, 2024

అధికారం కట్టబెట్టకుంటే, టిడిపికి 2024 చివరి ఎన్నికలు కావొచ్చు: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

కర్నూల్: ప్రజలు కనుక 2024లో కూడా తెలుగు దేశం పార్టీని ఎన్నుకుని అధికారం కట్టబెట్టకపోతే, తమ పార్టీకి అదే చివరి ఎన్నిక అవుతుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూల్ జిల్లాలో బుధవారం రాత్రి రోడ్ షో నిర్వహించిన ఆయన భావోద్వేగానికి లోనై ప్రసంగించారు. “నేను మళ్లీ అసెంబ్లీకి వెళ్లాలన్నా, రాజకీయాల్లో ఉండాలన్నా, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలన్నా…అది మీరు వచ్చే ఎన్నికల్లో టిడిపిని ఎన్నుకుంటేనే సాధ్యం…అలా కాకుంటే టిడిపికి అదే చివరి ఎన్నిక అనుకోవచ్చు…” అంటూ చంద్రబాబు తెలిపారు. “ మీరు నన్ను దీవిస్తారా? నన్ను నమ్ముతారా?” అని ప్రశ్నించినప్పుడు అక్కడి ప్రజలు సానుకూలంగానే స్పందించారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 2021 నవంబర్ 19న నిండు సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తనని, తన భార్యను అవమానించిందని, తిరిగి అధికారంలోకి వచ్చేంత వరకు తాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టబోనని నాడే ప్రతిజ్ఞ చేశానని గుర్తుచేశారు. “ నా పోరాటం భవిష్యత్తు తరం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఇదేమి పెద్ద విషయం కాదు, నేనిది వరకే సాధించిన ప్రగతి మీకు మోడల్‌గా ఉంటుంది” అని పేర్కొన్నారు. కొందరు తన వయస్సును చూపెడుతూ అపహాస్యం చేస్తున్నారని, తానింకా శారీరకంగా ఫిట్‌గానే ఉన్నానని అన్నారు. తాను, నరేంద్ర మోడీ సమ వయస్కులమేనని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. 79 ఏళ్ల వయస్సులో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. తానింకా 72లోనే ఉన్నానని టిడిపి నేత అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి లాగేసిందని ఆయన విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News