- Advertisement -
విదేశాల నుంచి వచ్చిన 105 మందికి నెగెటివ్
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 40,730 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 205 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. మంగళవారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,76,341కు పెరిగింది. తాజాగా 160 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,69,488 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఒకరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 4,001కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.84 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,852 యాక్టివ్ కేసులున్నాయి.ఎట్ రిస్క్ దేశాల నుంచి మంగళవారం రాష్ట్రానికి వచ్చిన 105 మందికి పరీక్షలు నిర్వహించగా, నెగెటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -