- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,092 కొత్త కోవిడ్-19 కేసులు, 13 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 73,050కి చేరాయి. ఇప్పటివరకు తెలంగాణలో 589 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం తెలంగాణలో 20.358 యాక్టివ్ కేసులు… 52,103 మంది కరోనా రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో 535, రంగారెడ్డిలో 169, కరీంనగర్ లో 123, మేడ్చల్ లో 169 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,43,489 కరోనా పరీక్షలు నిర్వహించగా.. గత 24గంటల్లో కొత్తగా 21,346 కరోనా టెస్టులు చేసినట్టు అధికారులు తెలిపారు.
- Advertisement -