- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5 వేలకు చేరింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 216 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, మరో ఇద్దరు మృతి చెందారని ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఎపిలో 147, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 69మందికి కరోనా సోకినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 5,029 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇక, కరోనాతో ఇప్పటివరకు 77 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,510 ఆక్టీవ్ కేసులు ఉన్నాయి.ఇప్పటివరకు 2,403 మంది డిశ్చార్జ్ అయ్యారు.
216 New Corona Cases Reported in AP
- Advertisement -