హైదరాబాద్: మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 22 ఏళ్ళ బ్యూటీషియన్ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని సూర్యపేట్ జిల్లాలోని మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పి హిమబిందుగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి విళితే.. హిమబిందు మూడు సంవత్సరాల క్రితం బ్యూటీషియన్ కోర్సు నేర్చుకోవడానికి హైదరాబాద్ కు వచ్చింది. అస్మాన్ గడ్ లోని వెంకటాద్రి నగర్ లో నివసిస్తున్న స్వాతి అనే బ్యూటీషియన్ వద్ద కోర్సు నేర్చుకుంటూ.. స్వాతి కుటుంబంతోనే కలిసి ఉంటోంది. అయితే, ఆదివారం తన గదిలోని ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హిమబిందును స్వాతి సోదరుడు గమనించాడు. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించి, అపస్మారక స్థితిలో ఉన్న హిమబిందును దిల్ సుఖ్ నగర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
22 Yrs Old Beautician Attempt Suicide in Malakpet