Thursday, April 25, 2024

రాష్ట్రంలో కొత్తగా 220 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

220 new Covid-19 cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 44,200 మందికి కరోనా పరీక్షలు 220 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,65,504కు పెరిగింది. తాజాగా 255 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,57,040 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఒక్కరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,915కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.72 శాతంగా నమోదు కాగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,549 యాక్టివ్ కేసులున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News