- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్ర స్థాయిలో విస్తరిస్తుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22,252 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 467మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 7, 19,665కు చేరింది. ఇక, కరోనాతో దేశంలో ఇప్పటివరకు 20,160 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 2,59,557 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా బారి నుంచి ఇప్పటివరకు 4,39,947మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
22252 New Corona Cases Reported in India
- Advertisement -