- Advertisement -
హైదరాబాద్: రైస్ మిల్లులో పనిచేసేందుకు వలసకూలీలు నగరానికి వచ్చారని మంత్రి గంగుల కమాలాకర్ తెలిపారు. బిహార్ నుంచి 225మంది వలసకూలీలు శుక్రవారం నగరానికి చేరుకున్నారు. బిహార్ నుంచి శ్రామిక్ రైలులో తొలివిడుత కూలీలు లింగంపల్లిలో దిగారు. వలసకూలీలకు గంగుల కమలాకర్, రైతుబంధు సమన్వయ సమితి ఛైర్మెన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ ఛైర్మెన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి పూలు ఇచ్చి స్వాగతం పలికారు. వలసకూలీలను నల్గొండ, మిర్యాలగూడ, కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, సల్తానాబాద్, సిద్దిపేట, మంచిర్యాలకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం వారిని జిల్లాలకు తరలించామని అధికారులు తెలిపారు.
225 migrant workers from Bihar came to Hyderabad
- Advertisement -