Friday, April 26, 2024

ఎపిలో ఒక్కరోజే కరోనాతో 98మంది మృతి

- Advertisement -
- Advertisement -

22517 New Corona Cases Reported in AP

అమ‌రావ‌తి: రెండో దశ కరోనా తీవ్రస్తాయంలో విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు భారీగా న‌మోదవుతున్నాయి. ఎపిలో గత 24 గంట‌ల్లో 89,535మందిని పరీక్షించగా.. కొత్త‌గా 22,517 క‌రోనా కేసులు న‌మోదు కాగా, 98మంది బాధితులు మరణించారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 14,11,320కి చేరుకుంది. ఇక, కరోనాతో ఇప్పటివరకు 9,271 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. గ‌డిచిన 24 గంట‌ల్లో 18,739 మంది క‌రోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 11,91,687 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 2,07,467 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

22517 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News