Wednesday, April 24, 2024

తెలంగాణలో కొత్తగా 2,256 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2257 new covid 19 cases recorded in telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 2,256 కొత్త కోవిడ్-19 కేసులు 14 మరణాలు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 77,513చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మృతుల సంఖ్య 615కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 22,568 యాక్టివ్ కేసులుండగా… 54,330 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

కొత్తగా హైదరాబాద్ లో 464, రంగారెడ్డిలో 181, మేడ్చల్ లో 138 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 5,90,306 పరీక్షలు చేయగా… గత 24గంటల్లో కొత్తగా 23,322 మందికి కరోనా టెస్టులు చేసినట్టు అధికారులు తెలిపారు. 1,596 శాపిళ్ల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. మరో 15,830 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో రికవరీ రేటు 70.09 శాతంగా ఉండగా, ఇది దేశ సగటు (67.98శాతం) కంటే ఎక్కువ అని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ వివరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News