Friday, April 19, 2024

మహబూబ్‌నగర్‌లో కరోనా కలకలం.. 23 రోజుల చిన్నారికి పాజిటివ్‌

- Advertisement -
- Advertisement -

 

మహబూబ్‌నగర్‌: జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జిల్లాలో 23 రోజుల చిన్నారికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని కలెక్టర్‌ వెంకట్రావు తెలిపారు. మర్కజ్‌ వెళ్లొచ్చిన వారి ద్వారా కొత్తగా ముగ్గిరికి కరోనా సోకొనట్లు తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య పదికి చేరుకుంది. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులు ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరెవరిని కలిశారని అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రజలు ఇంట్లోనే ఉండాలని, అనవసరంగా బయటకు రావొద్దని కలెక్టర్ కోరారు. జిల్లాలో కరోనాను ఎదుర్కునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.

23 days baby tested corona positive in Mahabubnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News