Friday, March 29, 2024

రష్యా దాడిలో 23 మంది ఉక్రెయిన్ పౌరుల మృతి

- Advertisement -
- Advertisement -

23 Ukrainian citizens killed in Russian attack

కీవ్: ఉక్రెయిన్‌లోని జపోరిజిజియా నగరంపై రష్యా సేనలు జరిపిన వైమానిక దాడిలో 23 మంది పౌరులు మరణించగా మరో 28 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. రష్యా ఆక్రమించుకున్న సరిహద్దుల వైపు వెళుతున్న పౌరుల వాహనాలపై రష్యా సేనలు దాడులు జరిపినట్లు జపోరిజిజియా ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సాండర్ స్లారూఖ్ ఆన్‌లైన్ ద్వారా ఒక ప్రకటన చేశారు. దగ్ధమైన వాహనాలు, రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల ఫోటోలను ఆయన విడుదల చేశారు. అయితే..ఈదాడులను రష్యా ఇప్పటివరకు ధ్రువీకరించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News